శనైశ్వర స్తుతి
నమః కృష్ణాయ నీలాయ
శిశిఖండ నిభాయచః
నమో నీల మధూకాయ
నీలోత్పల నిభాయచ!!
కృష్ణ స్వరూపుడు నీలవర్ణుడు, నిప్పు తునకతో సమానుడు నల్లని ఇప్పపూవువంటివాడైన శనీశ్వరునికి మనస్కారం. త్వష్ట ప్రజాపతి తన కూతురు సంజ్ఞాదేవిని సూర్యునికిచ్చి వివాహం చేయగా, సూర్యుని కిరణాల వేడిమిని భరించలేక తన ఛాయ అనగా నీడకు ప్రాణం పోసి భర్త వద్ద వదిలి తాను తన తండ్రివద్దకు వెళ్ళిపోతుంది. ఈ ఛాయాదేవి, సూర్యు భగవానుల కుమారుడే శనీశ్వరుడు. ఈయన విభవ నామ సంవత్సరం, మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి తిథియందు ధనిష్టా నక్షత్రంలో జన్మించాడు. ఈయన కుడిచేతిలో దండం, ఎడమ చేతిలో కమండలాలు ఉంటాయి.
హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్పుడు, పురూరవుడు, సాగరుడు, కార్త్య వీర్యార్జునుడు వీరంతా శని మహిమ వల్ల అనేక కష్టనష్టాలను పొంది చివరకు శని కృపాదృష్టితో ఆనందాన్ని పొందారు. శనీశ్వరుడు విష్ణుమూర్తికి తోడల్లుడు, సూర్యుని కుమారుడు, యమధర్మ రాజుకి, యమునా నదికి సోదరుడు. గ్రహాలకు యువరాజు వంటివాడు. ఆంధ్రప్రదేశ్ లోని మందపల్లి, మహారాష్ట్రలో శని శింగనాపూర్, తమిళనాడులో తిరునళ్ళార్ శని క్షేత్రములు. అయితే పూర్తి వాస్తుతో అతిశక్తివంతమైన 7వ శతాబ్దం నాటి క్షేత్రం పాండిచ్చేరిలోని తిరువళ్ళార్ లో వుంది. శని ప్రభావం వల్ల నల మహారాజు వస్త్రాలను పక్షి ఎగురవేసుకుపోయే దృశ్యాలు ఈ క్షేత్రంలో కన్పిస్తాయి. నలమహారాజు శని విముక్తి చేసే చిత్రాలు అక్కడ కన్పిస్తాయి. భక్తులు నూనెతో స్నానం చేసి ఆ తర్వాత అక్కడి చెరువులో స్నానం చేస్తే చాలు ఎంతమాత్రం జిడ్డు కనిపించదు. లక్షలాదిమంది స్నానం చేసే ఆ చెరువులో జిడ్డు కనిపించకపోవడమే అక్కడి విశేషం.
ఈ పవిత్ర క్షేత్రంలో బంగారు కాకిపై శనీశ్వర దేవునికి ఊరేగింపును చేస్తారు. ఈ స్వామి వారి భార్యల పేర్లు నీలాదేవి, మంగాదేవి. ఈ స్వామి పడమర దిక్కుగా వుంటాడు. శంగణాపూర్, మందవల్లి, నర్సింగ్ ల్ , విజయవాడ, జాల్నా, పాపగడ్, వైదీశ్వరన్ కోయిల్లలోని దేవాలయాలన్నీ శనీశ్వర దేవాలయాలలో ప్రఖ్యాతిగాంచినవి. శని త్రయోదశి పర్వదినాలలో మండవల్లిలోని శ్రీమందేశ్వర స్వామివారికి శని దోష పరిహారార్ధం తైలాభిషేకాలు చేసుకుంటే శని దేవుని వలన కలిగే సమస్త దోషాలు నివారించబడతాయని స్కంద పురాణంలో లిఖితమై ఉంది.

జీవితంలో కష్టనష్టాలకు లోనై మరే దేవుడు రక్షించని తరుణంలో చివరగా గుర్తుకు వచ్చేది శని శింగణాపూర్ లోని శనీశ్వరుడు. ఇటీవల కాలంలో తిరుపతి వెళ్ళేవారు ఏ విధంగా కాణిపాకం విఘ్నేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారో అదేవిధంగా షిర్డీ సాయి బాబాను దర్శించుకోవడానికి వెళ్ళినవారు శని శింగణాపూర్ క్షేత్రాన్ని దర్శిస్తున్నారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా నెవాసా తాలూకాకు చెందిన ఆ గ్రామం గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించింది. ఏ ఇంటికీ గుమ్మాలు లేకపోవడం ఆ గ్రామం ప్రత్యేకత. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం ఆ గ్రామ జనాభా 3000 కాగా ఇళ్ళు దాదాపు 450 వరకూ ఉంటాయి, గ్రామ కట్టుబాటు, పూర్వపు ఆచారం నూతన గృహాలకు కూడా తలుపులు ఉండవు. గ్రామంలో పోలీస్ స్టేషన్ లేదు. పోలీసులకు దొంగతనాలు, ఇతర నేరాల గురించి ఫిర్యాదులు ఉండవు. ఇంటువంటి సమస్యలు గ్రామస్థాయిలోనే పరిష్కారమవుతాయి. అందుకే వారు ‘మాకు దేవుడు ఉన్నాడు కానీ మా దేవుడికి గుడిలేదు. ఎండకు ఎండుతాడు వానకు తడుస్తాడు. మాకు ఇళ్ళు ఉన్నాయి కాని వాటికి గుమ్మాలు, తలుపులు లేవు. మా సూర్యపుత్రుడు శనీశ్వరుడే మా ఇళ్ళకు రక్షగా ఉంటాడు’ అంటారు. సాధారణంగా అందరూ శని పేరు ఎత్తటానికి భయపడుతుంటారు. కాని ఆ గ్రామస్థులు శనీశ్వరుణ్ణి తమ ఆప్తదేవుడుగా నిత్యం కొలుస్తారు. అన్ని కార్యక్రమాలకు ఆయన్నే నమ్ముకుంటారు. ప్రతీదానికి వినాయకునితోపాటు శనీశ్వరుణ్ణి తలచుకుంటారు. ప్రతీ నెలా అమావాస్య మర్నాడు చంద్రోదయం రోజున లక్షలాదిమంది భక్తులు శనిదేవుని దర్శిస్తారు. శని త్రయోదశి సోమవారాలనాడు అధికసంఖ్యలో భక్తులు వస్తారు. సాధారణ రోజులలో కూడా భక్తుల సంఖ్య గణనీయంగానే ఉంటుంది. దేవాలయంలోకి అందరికీ ప్రవేశం ఉన్నా మగవారు మాత్రమే శనిదేవుని పూజాకార్యక్రమం నిర్వహించాలి. వారు విధిగా తలస్నానం చేసి కాషాయరంగు లుంగీ లేదా పంచె మాత్రమే ధరించాలి, ఈ వస్త్రాలు ఇక్కడ లభ్యమవుతాయి. పూజ తర్వాత వదిలివేయాలి. ముఖ్యమైన రోజులలో కాషాయవస్త్రధారులతో శని శింగణాపూర్ శోభాయమనంగా ఉంటుంది. ఆరోజు దృశ్యం చూడముచ్చటగా, ఆలయప్రాంగణం సుందరంగా ఉంటుంది. సదుపాయాలు. పెద్ద ఎత్తున విసృతపరుస్తున్నారు. ఇది కేవలం విరాళాలవల్లే సాధ్యపడుతోంది. గ్రామప్రవేశానికి రెండు రూపాయల పంచాయితీ ప్రత్యేక టోల్ ఫీజు మాత్రం వసూలు చేస్తున్నారు. ఈ దేవాలయానికి అనుబంధంగా మరొక పాఠశాలను, గోసంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వసతి ఏర్పాట్లు ఉన్నాయి. లగ్జరీ గదులతోపాటు సాధారణ గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆలయ నిర్వహణ ఆహ్లాదకరంగా ఉంది.

ఇక్కడ శని విగ్రహాన్ని 16 అడుగుల 16 అంగుళాల పొడవు, వెడల్పు గల 3 అడుగుల ఎత్తుగల సమచతుర్భుజ ప్లాట్ ఫాంపై ప్రతిష్టించారు. విగ్రహం శివలింగం ఆకారాన్ని పోలి ఉంటుంది. ఇనుములా తలపించే నల్లరాతి విగ్రహం ఎత్తు ఐదున్నర అడుగులు, వెడల్పు ఒకటిన్నర అడుగులు. శనిపీడితులు కాషాయ వస్త్రధారులై అర్చకుని సహాయంతో ఈ విగ్రహంపైనే తైలాభిషేకం చేసి దోషనివారణ పొందుతారు. ఈ ప్లాట్ ఫాంపై గల శనీశ్వరుణ్ణి అందరూ వీక్షీంచవచ్చు. అయితే ప్లాట్ ఫారాన్ని ఆడవాళ్ళు తాకరాదనే నియమం వుంది.

మనం చెప్పుకుంటున్న శనిశింగణాపూర్ తో పాటు మరో ఎనిమిది క్షేత్రాలు ఉన్నాయి. వాటినే నవ శనిక్షేత్రాలు అంటారు.
1. మహారాష్ట్రలోని నాసిక్ సమీపానగల నందగావ్.
2. మధ్యప్రదేశ్ లో గ్వాలియర్ దగ్గర శనిబాధేశ్వర్
3. మధ్యప్రదేశ్ లో జబల్పూర్ దగ్గర పిపాల్ గావ్.
4. తమిళనాడులోని తరునల్లార్.
5. ఉత్తరప్రదేశ్ లోని మధుర సమీపాన కొకిల్వన్.
6. ఉత్తరప్రదేశ్ లోని నిర్లాపూర్ సమీపాన శనితీర్థ.
7. మహారాష్ట్రలోని ఔరంగబాద్ జిల్లాలో శనిభగవాన్ తీర్థం.
8. చత్తీస్ ఘట్ రాష్ట్రంలోని థమ్ ప్రాంతంలో శనిదేవక్షేత్రం. భరతఖండంలో గుజరాత్, సౌరాష్ట్రల్లో శని
ఆవిర్భవించాడనే నమ్మకం ఉంది.

తండ్రి: సూర్యభగవానుడు
తల్లి: ఛాయాదేవి
సోదరుడు: యమధర్మరాజు
సోదరి: యమున
స్నేహితులు: హనుమాన్, కాలభైరవుడు
ఇతర పేర్లు: కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర
గోత్రం: కాశ్యపన.

నల్ల వస్త్రం. నూనెదీపం, అగరవత్తులు, నువ్వులనూనె, స్వీట్లు, పండ్లు, దండ, జిల్లేడు ఆకులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, కొబ్బరికాయలు, గుర్రపు నాడా, చిన్న దిష్టిబొమ్మ. ఇవి సమర్పించలేనివారు పావు లేదా అరలీటరు నూనెతో తైలాభిషేకం చేయొచ్చు.
శని దోషము:
శని లగ్నాత్ సప్తమములో ఉన్ననూ, అష్టమములో ఉన్ననూ మహాపాపి. శని లగ్నాత్ చతుర్థములోనున్న అర్ధాష్టమ శని అనబడును. శని అష్టమస్థానములోనున్న అష్టమశని అనబడును. ఈ దోషముల వలన అనేక చికాకులు, ఋణగ్రస్థులగుట ఇత్యాది కష్టములు ప్రాప్తించును. గోచారరీత్యా ( పంచాంగ సంవత్సర ఫలితాలు) చంద్ర లగ్నాత్ శని పన్నెండోఇంట, చంద్రుడున్నరాశియందు మరియు రెండవఇంట శనిసంచారం చేయునప్పుడు ఏల్నాటి శని లో అనబడును.
క్లుప్తముగా జన్మరాశికి 12, 1, 2, స్థానములలో శని సంచరించుటనే ఏల్నాటి శని అనబడును. 12 లో 2 ½ , 1 లో 2 ½, 2 లో 2 ½, లో ఒక్కొక్క రాశిలో2 ½ సంవత్సరాల చొప్పున మొత్తం మూడు రాశులకి కలిపి 7 ½ సంవత్సరాల దోషమగును. దరిద్రము, ఇంటిపోరు, కష్టాలు ,మానహాని, వ్యవహార చిక్కులు కలుగును.
శనిగ్రహ దోషము క్రింది విధంగా కనిపిస్తుంది.
మేషంలో నీచపడితే, శత్రు క్షేత్రములో ఉంటే, గోచార రీత్యా లగ్న, షష్టాష్టములో సంచరించేటప్పుడు, జాతక చక్రంలో 1,2,3,4,5,6,7,8,9,10,11,12 ఉన్నా ఏలినాటి శని సమయంలో, శని మహర్దశ, అంతర్దశలలో శత్రుగ్రహాలైన రవి, చంద్ర, కుజలతో కలిసి ఉంటే శని మహర్దశ, అంతర్దశలలో గ్రహశాంతి చేయాలి.
శనిగ్రహ జపం
అస్యశ్రీ శనిగ్రహ మహా మంత్రస్య హిళింభి ఋషిః శనైశ్చర
గ్రహోదేవతా! ఉష్టిక్ చంధః! శనైశ్చర గ్రహ ప్రసాద సిద్దర్ధ్యే
శనిపీడా నివారణార్ధే శనిమంత్ర జపే వినియోగః
ఓం శమగ్ని - అంగుష్టాభ్యాసం నమః
ఓం అగ్నిభిస్కరత్ - తర్జనీభ్యాం నమః
ఓం విష్ణుశంనస్తపతుసూర్యః - మధ్యమాభ్యాం నమః
ఓం శంవాతః - అనామికాభ్యాం నమః
ఓం వాత్వరపాః - కనిష్టికాభ్యాసం నమః
ఓం అపశ్రిధః - కరతల కరపృష్టాభ్యాసం నమః అంగన్యాసము:
ఓం శమగ్ని: - హృదయాయ నమః
ఓం అగ్నిభిస్కరత్ - శివసేస్వాహ
ఓం శంనస్తపతుసూర్యః - శిఖాయైవషట్
ఓం శంవాతః - కవచాయహు
ఓం వాత్వరపాః - నేత్రత్రయాయ వౌషట్
ఓం అపశ్రిధ్ర - అస్త్రాయఫట్
ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధం
ఇమం యమ ప్రస్తరమాహి సీదాంగి రోభి: పితృభిప్సం విదానః!
అత్వా మంత్రాః కవిసహస్త్వా వహ న్వైనారాజన్ హవిషామదయస్వ!!
ప్రత్యథి దేవతా: ప్రజాపతే సత్వ దేవతాన్యోన్యో విశ్వాజాతాని పరితాబభూవ!
యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తువయగ్గౌ శ్యామ పతయోరయీణాం!!
ఓం శమగ్ని రాజ్ఞి భిస్క రచ్చన్న స్తపతు సూర్యః శం వాతో వాత్వరపా అపశ్రిధః
శని కవచ స్తోత్రము శనైశ్చరశ్శిరో రక్షేత్! ముఖం భక్తార్తి నాశనః కర్ణౌకృష్ణాంబరః పాతు!
నేత్రే సర్వ భయంకరః!! కృష్ణాంగో నాసికాం రక్షేత్! కర్ణౌ మేచ శిఖండిజ:! భుజౌమే సుభుజః పాతు!
హస్తా నీలోత్పల ప్రభః! పాతుమే హృదయం కృష్ణ:! కృక్షిం శుష్కోధర స్తధాః! కటిం మే వికటః పాతు!
ఊరూ మే ఘోర రూపవాన్! జానునీ పాతు దీర్ఘోమే! జంఘేమే మంగళ ప్రభః! గల్పౌ గణాకరః పాతు!
పాదౌ మే మంగుపాదకః! సర్వాణిచ మామాచంగాని! పాతు భాస్కరనందనః!
య ఇదం కవచం దివ్యం సర్వ పీదాహరం ణాం పఠతి శ్రద్దయా యుక్తః! సర్వాన్ కామానవాప్నుయాత్!
శని మంగళాష్టకమ్ మందః కృష్ణవిభస్తు పశ్చిమ ముఖః సౌరాష్టవో కాస్యవః!
నక్రేశో ఘటన సుహృద్భుధ భ్రుగుర్వైరీంద్వ వక్ష్యాసుతః!! స్థానం పశ్చిమ దిక్ర్పజాపతిర్యమౌదేవౌ ధనస్త్వాసనం!
షట్రష్ట స్శుభకృచ్ఛమీ రవిసుతః కూర్యాత్సదా మంగళం!!
శన్యష్టోత్తర శతమామావళి ఓం శనైశ్చరాయ నమః ఓం శాంతాయ నమః
ఓం శరణ్యాయ నమః ఓం వరేణ్యాయ నమః ఓం సర్వేశాయ నమః
ఓం సౌమ్యాయ నమః ఓం సురవంద్యాయ నమః ఓం సురలోక విహారిణే నమః
ఓం సుఖాననోవిష్టాయ నమః ఓం సుందరాయ నమః ఓం ఘనాయ నమః
ఓం ఘనరూపాయ నమః ఓం ఘనాభరణధారిణే నమః ఓం ఘనసారవిలేపాయ నమః
ఓం ఖద్యోతాయ నమః ఓం మందాయ నమః ఓం మందచేష్టాయ నమః
ఓం మహనీయగుణాత్మనే నమః ఓం మర్త్యపావనపాదాయ నమః
ఓం మహేశాయ నమః ఓం ఛాయాపుత్త్రాయ నమః ఓం శర్వాయ నమః
ఓం శ్రతూణీరధారిణే నమః ఓం చరస్థిరస్వభావాయ నమః ఓం చంచలాయ నమః
ఓం నీలవర్ణాయ నమః ఓం నిత్యాయ నమః ఓం నీలాంబసనిభాయ నమః
ఓం నీలాంబరవిభూషాయ నమః ఓం నిశ్చలాయ నమః ఓం వేద్యాయ నమః
ఓం విధిరూపాయ నమః ఓం విరోధాధార భూమయే నమః
ఓం వేదాస్పదస్వాభావాయ నమః ఓం వజ్రదేహాయ నమః ఓం వైరాగ్యదాయ నమః
ఓం వీరాయ నమః ఓం వీతరోగభయాయ నమః ఓం విపత్పరంపరేశాయ నమః
ఓం విశ్వనంద్యాయ నమః ఓం గృద్రహహాయ నమః ఓం గుధాయ నమః
ఓం కూర్మాంగాయ నమః ఓం కురూపిణే నమః ఓం కుత్సితాయ నమః
ఓం గుణాధ్యాయ నమః ఓం గోచరాయ నమః ఓం అవిద్యామూలనాశాయ నమః
ఓం విద్యావిద్యాస్వరూపిణే నమః ఓం ఆయుష్యకారణాయ నమః ఓం ఆపదుద్దర్త్రే నమః
ఓం విష్ణుభక్తాయ నమః ఓం వశినే నమః ఓం వివిధాగమనేదినే నమః
ఓం విధిస్తుత్యాయ నమః ఓం వంద్యాయ నమః ఓం విరూపాక్షాయ నమః
ఓం వరిష్టాయ నమః ఓం వజ్రాంకుశధరాయ నమః ఓం వరదాయ నమః
ఓం అభయహస్తాయ నమః ఓం వామనాయ నమః ఓం జేష్టాపత్నీసమేతాయ నమః
ఓం శ్రేష్టాయ నమః ఓం అమితభాషిణే నమః ఓం కస్టౌఘనాశకాయ నమః
ఓం ఆర్యపుష్టిదాయ నమః ఓం స్తుత్యాయ నమః ఓం స్తోత్రగమ్యాయ నమః
ఓం భక్తివశ్యాయ నమః ఓం భానవే నమః ఓం భానుపుత్త్రాయ నమః
ఓం భావ్యాయ నమః ఓం పావనాయ నమః ఓం ధనుర్మందల సంస్థాయ నమః
ఓం ధనదాయ నమః ఓం ధనుష్మతే నమః ఓం తనుప్రకాశ దేహాయ నమః
ఓం తామసాయ నమః ఓం అశేషజనవంద్యాయ నమః ఓం విశేషఫలదాయినే నమః
ఓం వశీకృతజనిశాయ నమః ఓం పశూనాంపతయే నమః ఓం ఖేచరాయ నమః
ఓం ఖగేశాయ నమః ఓం ఘననీలాంబరాయ నమః ఓం కాఠిన్యమానసాయ నమః
ఓం అరణ్యగణస్తుత్యాయ నమః ఓం నీలచ్చత్రాయ నమః ఓం నిత్యాయ నమః
ఓం నిర్గుణాయ నమః ఓం గుణాత్మనే నమః ఓం నిరామయాయ నమః ఓం నింద్యాయ నమః
ఓం వందనీయాయ నమః ఓం ధీరాయ నమః ఓం దివ్యదేహాయ నమః ఓం దీనార్తి హరణాయ నమః
ఓం దైన్య నాశకరాయ నమః ఓం ఆర్యజనగణణ్యాయ నమః ఓం క్రూరాయ నమః
ఓం క్రూరచేష్టాయ నమః ఓం కామక్రోధకరాయ నమః ఓం కళత్రపుత్త్రశత్రుత్వ కారణాయ నమః
ఓం పరిపోషితభక్తాయ నమః ఓం భక్త సంఘమనోభీష్ట ఫలదాయ నమః ఓం శ్రీమచ్ఛనైశ్చరాయ నమః
శని దోష నివారణ
మనలో చాలామంది కళ్యాణ దోషం, కాలసర్ప దోషం, దుష్టమానవుల దృష్టి దోషాలు, వాస్తుదోషాలు, నవగ్రహ దోషాలు – ఇలా అనేక రకాల దోషాలతో బాధపడుతుంటారు. గ్రహల్లో శని ప్రభావం చాలా ఎక్కువ, శని దోషం ఉన్నవారు సుఖశాంతులు లేకుండా బాధపడుతుంటారు. శని దోషం వల్ల ఏవో కష్టనష్టాలు పట్టి పీడిస్తుంటాయి. శని దోషం నుండి బయట పడేందుకు దేవాలయాల్లో అర్చకులు ఉపశాంతి చేస్తుంటారు. నవగ్రహారాధన, ప్రత్యేకంగా శని గ్రహారాధన సూచిస్తుంటారు. శని గ్రహ పూజలతో పాటు, శని ధ్యానం చేసినా దోష నివారణ అవుతుంది. శనిధ్యానం శ్లోకాలు ఆరు. ఈ శ్లోకాలను మనసారా స్మరించుకోవాలి.
సూర్యపుత్రో దీర్ఘదేహః
విశాలక్ష శ్శివప్రియ:
మందచార: ప్రసన్నాత్మా
పీడాం దహతు మే శని:
శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే
నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజం
చాయా మార్తాండ సంభూతం
తన్నమామి శనైశ్చరం
నమస్తే కోణ సంస్థాయ
పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రు రూపాయ
కృష్ణాయచ నమోస్తుతే
మనస్తే రౌద్ర దేహాయ
నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ
నమస్తే సౌరాయే విభో
నమస్తే మంద సంజ్ఞాయ
శనైశ్చర నమోస్తు
ప్రసాదం మమదేవేశ
దీనస్య ప్ర్రణతస్యచ
ఓం, ఐం, హ్రీం, శ్రీం శనైశ్చరాయనమః
ఈ శని ధ్యాన శ్లోకాలను 19 వేలసార్లు పఠించినట్లయితే ఎలాంటి శని దోషాలైనా నివారణ అవుతాయి.
శుక్రమహర్దశలో చేయవలసిన దానములు:
1. శని మహర్దశలో శని అంతర్దశలో నువ్వులు దానము చేయండి.
2. శని మహర్దశలో రవి అంతర్దశలో గుమ్మడికాయపై యధాశక్తి బంగారంతో దానం చేయండి.
3. శని మహర్దశలోచంద్రుని అంతర్దశలో తెల్లని ఆవును దానము చేయండి.
4. శని మహర్దశలో కుజుడు అంతర్దశలో దున్నను దానము చేయండి.
5. శని మహర్దశలో బుధుడు అంతర్దశలో దున్నను దానము చేయండి.
6. శని మహర్దశలో గురుడు అంతర్దశలో బంగారు మేకను దానము చేయండి
7. శని మహర్దశలో శుక్రుడు అంతర్దశలో నల్ల మేక, నువ్వులు, ఇనుము, లవణం, నూనెను దానము
చేయండి
8. శని మహర్దశలో రాహువు అంతర్దశలో సీసమును దానము చేయండి
9. శని మహర్దశలో కేతువు అంతర్దశలో బంగారం, నువ్వులు దానము చేయండి

1. రవి మహర్దశలో మేకను దానం చేయండి.
2. చంద్రుని మహర్దశలో శని అంతర్దశలో దున్నను దానం చేయండి.
3. కుజుడు మహర్దశలో శని అంతర్దశలో నువ్వుల పిండిని దానం చేయండి.
4. బుధుని మహర్దశలో శని అంతర్దశలో దున్నను దానం చేయండి.
5. గురుని మహర్దశలో శని అంతర్దశలో నల్లమేకను దానం చేయండి.
6. శుక్రుని మహర్దశలో శని అంతర్దశలో దున్నను దానం చేయండి.
7. రాహువు మహర్దశలో శని అంతర్దశలో నల్లమేకను దానం చేయండి.
8. కేతు మహర్దశలో శని అంతర్దశలో యమప్రీతికు దున్నను దానం చేయండి. గమనిక: కొన్ని వస్తువులు
దొరకనప్పుడు వాటికి మారుగా ధనమిచ్చుటకన్నా ఆ వస్తువు ఆకారంలో వెండితో ప్రతిమ చేయించి
దక్షిణతో ధారపోయండి.
శని దోషం – పరిహారం – శాంతులు:
1. ప్రతిరోజూ మధ్యాహ్నం కాకులకు బెల్లంతో కలిపిన నల్లనువ్వులు పెట్టాలి.
2. ఒక స్టీలు పాత్రలో నల్లనువ్వులు, ఉప్పు, మేకు, నల్లదారం ఉండ, నువ్వుల నూనె, నల్లబొగ్గు, నల్లని
వస్త్రమును దానం చేయండి
3. శనిగ్రహ జపం చేయించి బ్రాహ్మణుకి శక్తిమేరకు దానం చేయండి.
4. జాతినీలంఎడమచేతి మధ్య వెలికి వెండితో చేయించి శనివారం ఉదయం 6 గంటలకు ధరించండి.
1.25కే.జీ ల నల్ల నువ్వులు దానం చేయండి
5. నవగ్రహములలో శని విగ్రహమునకు నువ్వుల నూనెతో తైలాభిషేకము చేసి స్టీలు ప్రమిదలో 19 నల్ల
వత్తులతో దీపారాధన చేసి నలుపు వస్త్రములు దానం చేయండి.
6. 40 రోజులు నవగ్రహ ప్రదక్షిణాలు చేసి చివరి రోజున శని పూజ, తైలాభిషేకం చేసి స్తోత్ర పారాయణం
చేయండి.
7. నీలమేఘ వర్ణం గల పుష్పములు, నల్ల వస్త్రములు సమర్పించి దానం చేయండి
8. మండలపూజ, అయ్యప్పదీక్ష (మకరజ్యోతి దర్శనం) ద్వారా శని అనుగ్రహ పాత్రులు కండి.
9. 19సార్లు శని తైలాభిషేకం చేయించి నువ్వులు దానం చేయండి ప్రతిరోజూ శని శ్లోకం 19 సార్లు పఠించండి.
10. శని ధ్యాన శ్లోకాన్ని రోజుకు' 190 మార్లు చొప్పున 190 రోజులు పారాయణ చేయండి.
11. శని గాయత్రి మంత్రంను 19 శనివారములు 190 మార్లు పారాయణం చేయండి.
12. శని గాయత్రి మంత్రంను 40 రోజులలో 19000 మార్లు జపం చేయండి.
13. 19 శనివారం నవగ్రహాలకు 190 ప్రదక్షిణాలు చేసి 1.25కే.జీ. నువ్వులు దానం చేయండి.
14. మందపల్లిలోని శనేశ్వరుని దేవస్థానంకు ఒక శనివారం లేదా శనిత్రయోదశి నాడు దర్శించి
తైలాభిషేకం చేయించండి.
15. శనివారం రోజున నువుండలు, నువ్వూ జీడీలు పేదలకు సాధువులకు పంచి పెట్టండి.
16. 19 శనివారంలు ఉపవాసం ఉండి చివరి శనివారం ఈశ్వరునికి అభిషేకం మరియు శని అష్టోత్తర పూజ
చేయవలెను
17. తమిళనాడులో తిరునళ్ళూరు దేవస్థానంను దర్శించి శని హోమం చేయండి.
18. షిర్డీ పుణ్యస్థలందగ్గరలో శని శింగణాపూర్ దర్శించి స్వయంగా తైలాభిషేకం చేయండి.
19. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వరుని దేవాలయంలోని శని ప్రత్యేక
దేవాలయం దర్శించితైలాభిషేకం చేయండి.
1. శనీశ్వరుడు ప్రతి రాశిలో 2 ½ సంవత్సరాలు సంచరిస్తాడు, అలా మూడు రాసులలో శని గోచార రీత్యా
12, 1, 2 స్థానంలో 7 ½ సంవత్సరాలు సంచరించే కాలంను ఏలినాటి శని అంటారు. శని చతుర్ధ
స్థానంలో గోచారరీత్యావున్నచో అర్దాష్టము శని అని, అష్టమ స్థానంలో వున్నచో అష్టమ శని అని
అంటారు. ఒక వ్యక్తి జీవితంలో 7 ½ సంవత్సరాలు ఏలినాటి శని మూడుసార్లు వస్తుంది. మొదటి
దానిని మంగు శని అని, రెండవది పొంగు శని అని, మూడవ దానిని మరణ శని అని అంటారు. 1.
షిర్డిలోని ద్వారకామాయి ధుని యందు నల్లనువ్వులు, కొబ్బరు కాయలు సమర్పించండి.
2. శనిదోష నివృత్తికి నలమహారాజు చరిత్రను పారాయణ చేయండి.
3. దగ్గరలో ఉన్న శ్రీసాయి దేవాలయానికి వెళ్ళి ధునిలోని నల్లనువ్వులు, నవధాన్యాలు వేసి 9 మార్లు
ప్రదక్షిణాలు చేయండి. ఇలా 19 శనివారములు చేయండి.
4. శివపంచాక్షరీ మంత్రాన్ని జపించుటగాని, అభిషేకం కాని చేయండి.
5. శనివారం నాడు ఆంజనేయస్వామి, శివాలయం, శ్రీకృష్ణ ఆలయాల్లో ప్రసాదములు పంచిపెట్టండి.
అన్నదానం చేయండి.
6. శనివారం నూనెలు, నూనె వస్తువులు కొనకూడదు. నల్ల ఆవులకు, నల్ల కుక్కలకు ఆహారం పెట్టినచో
మంచిది.
7. శనిత్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేయండి.
8. ప్రతి శనివారం ఒంటికి నువ్వుల నూనె రాసుకుని, గంట తర్వాత తలస్నానం చేయండి.
9. ప్రవహించే నీటిలో నల్ల నువ్వుల నూనె, బొగ్గులు, మేకులు, నవధాన్యాలు కలపండి.
10. శనివారం ఉదయం అన్నం ముద్దలో నువ్వులనూనె కలిపి నైవేద్యం చేసి కొద్దిగా తిని, ఎవరూ తొక్కని
ప్రదేశములో వదిలి వేయాలి. ఇలా శనివారాలు చేయాలి.
11. మయూరి నీలం కుడిచేతి మధ్య వేలుకి ధరించండి.
12. శనివారం 19 సంఖ్య వచ్చునట్లుగా దక్షిణ సమర్పించండి.
13. శ్రావణమాసంలో 19 రోజులు దీక్ష, శని తైలాభిషేకం చేస్తే చాలా మంచిది.
14. తీరికలేనివారు కనీసం శని శ్లోకం 19 మార్లుగాని శని మంత్రం 190మార్లు పారాయణ చేయండి.
15. మీ దగ్గరలో ఉన్న శివాలయం/ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి ప్రతి ఆదివారం ఉదయం 6
గంటలనుండి 7 గంటల వరకూ 190 ప్రదక్షిణలు చేయండి.
16. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం మరగిరి పాండవుల మెట్టపైన వున్న శనీశ్వర ఆలయం
దర్శించి తైలాభిషేకం జరపండి. శనీశ్వర కళ్యాణం దర్శించుకుంటే మంచిది.
శని చాలీసా
దోహా:
శ్రీ శనైశ్చర దేవజీ, సునహు శ్రవణ మమ టేర
కోటి విఘ్ననాశక ప్రభో, కరో న మమ హిత బేర
సోరఠా
తవ అస్తుతి హే నాథ, జోరి జుగల కర కరత హౌ
కరియే మోహి సనాథ, విఘ్నహరన హే రవి సువన
చౌపాయీ
శనిదేవ మై సుమిరౌ తోహి, విద్యాబుద్ధి జ్ఞాన దో మోహీ
తుమ్హరో నామ అనేక బఖానౌ, క్షుద్ర బుద్ధి మై జో కుచ్ జానౌ
అన్తక కొణ, రౌద్ర యమ గావూ, కృష్ణ బభ్రు శని సబహి సునావూ
పింగల మందసౌరి సుఖదాతా, హిత అనహిత సబజగకే జ్ఞాతా
నిత్త జపై జో నామ తుమ్హరా కరహు వ్యాధి దుఃఖ సె నిస్తారా
రాశి విషమవశ అనురన సురనర, పన్నగ శేష సహిత విద్యాధర
రాజా రంక రహిహిం జోకో, పశు పక్షీ వనచర సహబీ కో
కానన కిలా శివిర సేనాకర నాశ కరత గ్రామ్య నగర భర
డాలన విఘ్న సబహి కే సుఖమే వ్యాకుల హోహిం పడే దు: ఖమే
నాథ వినయ తుమసే యహ మేరీ, కరియే మోపర దయా థనేరీ
మమ హిత విషయ రాశి మహావాసా, కరియ ణ నాథ యహీ మమ ఆసా
జో గుడ ఉడద దే బార శనీచర, తిల జౌ లోహ అన్నధన బస్తర
దాన దియే సో హోయ్ సుఖారీ, సోయి శని సున యహ వినయ హమారీ
నాథ దయా తుమ మోపర కీజై కోటిక విఘ్న క్షణి మహా ఛీజై
వదంత ణథ జుగల కరి జోరీ, సునహు దయా కర వినతీ మోరీ
కబహు క తీరథ రాజ ప్రయాగా, సరయూ తీర సహిత అనురాగా
కబహు సరస్వతీ శుద్ధ నార మహు యా కహు గిరీ ఖోహ కందర మహ
ధ్యాన ధరత హై జో జోగి జనీ తాహి ధ్యాన మహ సూక్ష్మహోహి శని
హై అగమ్య క్యా కారూ బడాయీ, కరత ప్రణామ చరణ శిర నాయీ
జో విదేశ సే బార శనీచర, ముఢకర అవేగా నిజ ఘర పర
రహై సుఖీ శని దేవ దుహాయీ రక్షా వినిసుత రఖై బనాయీ
సంకట దేయ శనీచర తాహీ, జేతే దుఇఖీ హోయి మన మాహీ
సోయీ రవినందన కర జోరీ, వందన కరత మూఢ మతి థోరీ
బ్రహ్మ జగత బనావనహారా, విష్ణు సబహి నిత దేవ ఆహారా
హై త్రిశూలధారీ త్రిపురారీ, విభూదేవ మూరతి ఏక వారీ
ఇక హాయి ధారణ కరత శని నిత వందన సోయీ శని కో దమనచిత
జో నర పాఠ కరై మన చిత సే, సోన ఛూటై వ్యథా అమిత సే
హో సుపుత్ర ధన సన్తతి బాడే కలికాల కర జోడే ఠాడే
పశు కుటుంబ బాంధవ అది సే భరా భవన రహి హై నిత సబ సే
నానా భాతి ఖోగ సుఖ సారా, అన్య సమయ తజకర సంసారా
పావై ముక్తి అమర పద భాయీ జోనిత శని సమ ధ్యాన లాగాయీ
పడై పాత్ర జో నామ చని దస, రహై శనీశ్చర నిత ఉదకే బస
పీడా శని కీ బహున హోయీ, నిత శని సమ ధ్యాన లగాయీ
జో యహ పాఠ కరై చాలీసా, హోయ సుఖీ సఖీ జగదీశా
చాలీస దిన పడై సబేరే, పాతక నాశై శనీ ఘనేరే
రవి నందన కీ ఆస ప్రభు తాయీ జగత మోహ తమ నాశై భాయీ
యాకో పాఠ కరై జో కోయీ, సుఖ – సంపత్తి కీ కామీ న హాయీ
నిశిదిన ధ్యాన ధరై మన మాహీ అధి వ్యాధి డింగ ఆవై నాహీ
దోహా:
పాఠ శనైశ్చర దేవ కో, కీన్హౌ విమల తైయార
కరత పాఠ చాలీసా దిన, హో భవ సాగర పార
జో స్తుతి దశరథ జీ కి యో, సమ్ముఖ శని నిహార
సరస సుభాషా మే వహీ, లలితా లిఖే సుధార
ఇతి శని చాలీసా
శని శాంతి మంత్రం శని శాంతి మంత్ర స్తుతి
ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.
క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి
నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.
శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే
ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు, నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి.
ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.
శని పత్నీ నామ స్తుతి
శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి అతని పత్ని నామాలను నిత్యం పారాయణ చేస్తుండాలి.
ద్వజనీ దామనీ చైవ కంకాళీ కలహప్రియ
కంటకీ కలహీ చాథ తురంగీ మహిషీ
అజాశ నేర్మామాని పత్నీనామేతాని
సజ్జపన్ పుమాన్ దు: ఖాని నాశ్యేత్యం
సౌభాగ్యం వర్ధతే సుఖమ్
దశరథ కృత శని స్తోత్రం
దశరథుడు రచించిన శని స్తోత్రం గురించి పురాణ గాథ ఇలా ఉన్నది. దశరథుని తపస్సుకు మెచ్చిన శనైశ్చరుడు దశరథుడు కోరిన వరం ప్రసాదించి, మరో వరం కోరుకోమన్నాడు. అప్పుడు దశరథుడు “శనిదేవా! నేటి నుండీ మానవులను ఎవ్వరినీ మీరు బాధించవద్దు” అని వరం కోరుకున్నాడు. అప్పుడు శనిదేవుడు ''అది సాధ్యం కాదు.. నువ్వు నన్ను స్తుతిస్తూ స్తోత్రం రచించు. అది పఠించినవారిని నేను బాధించను'' అని వరమిచ్చాడు. ఆ వరానికి అనుగుణంగా దశరథుడు రచించినదే ఈ శని స్తోత్రం.
కుడిచేతిలోకి నీరు అక్షింతలు తీసుకుని ఓం అస్యశ్రీ శనిస్తోత్ర మహామంత్రస్య నుండీ జపే వినియోగః వరకు చెప్పిన తర్వాత నీరు వదిలేయాలి.
అథః వినియోగ:
ఓం అస్య శ్రీ శనిస్తోత్ర మంత్రస్య కశ్యప ఋషిః త్రిచ్చంద్ర: సౌరిర్దేవతా, శం బీజమ్, ని: శక్తి: కృష్ణ వర్ణేతి కీలకమ్, ధర్మార్థ కామ మోక్షాత్మ కచతుర్విధ – పురుషార్ధసిద్ద్యర్ధం జపేవినియోగః
అథ కరన్యాసం:
ఈ న్యాసం చెప్పేటప్పుడు పేరును బట్టి ఆ వేళ్లను స్పృశించాలి.
శనైశ్చరాయ అంగుష్టాభ్యాసం నమః
మందగతయే తర్జనీభ్యాం నమః
అధోక్షజాయ మధ్యమాభ్యాం నమ: కృష్ణాంగాయ అనామికాభ్యాం నమః
శుశ్కోదరాయ కనిష్టాంగాయ అనామికాభ్యాం నమః
శుష్కోదరాయ కనిష్టకాభ్యాం నమః చాయాత్మజాయ
కరతల కరపృష్టాభ్యాం నమః. అథ హృదయాది న్యాసః
అస్త్రాయ ఫట్ అనేటప్పుడు ఎడమ అరచేతిపై కుడిచేతితో చప్పట్లు కొట్టి ఫట్ అనే ధ్వని చేయాలి.
శనైశ్చరాయ హృదయాయ నమః మందగతయే శిరసే స్వాహా
అథోజాయ శిఖాయై వషట్ కృష్ణాంగాయ కవచాయ హుమ్
శుష్కోదరాయ నేత్రత్రాయ వౌషట్ ఛాయాత్మజాయ
అస్త్రాయ ఫట్ అథ దిగ్భంధనమ్ ఓం భూర్భవ: స్వః
అంటూ నాలుగు వైపులా చిటికెలు వేయాలి.
అథః ధ్యానమ్ నీదు ద్యుతిమ్ శూలధరమ్ కిరీటినం
గ్రథస్థితం త్రాసకరం ధనుర్ధరమ్ చతుర్భుజం
సూర్యసుతం ప్రశాంతం వందే సదాభీష్టకరం
వరేణ్యమ్ శని స్తోత్ర్రం ప్రారంభం నమః
కృష్ణాయ నీలాయ శితికంఠనిభాయ చ నమః
కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః
నమో నిర్మాసదేహాయ దీర్ఘశ్మశ్రు జటాయ చ నమో విశాల నేత్రాయ
శుష్కోధర భయాకృతే నమః పుష్కలగాత్రాయ స్థూలరోమ్ణ్థ వై నమః
నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే నమస్తే
కోట రక్షాయ దుర్నిరీక్ష్యాయ వై నమః నమో ఘోరాయ
రౌద్రాయ భీషణాయ కపాలినే నమస్తే సర్వభక్షాయ బలీముఖే నమోస్తుతే
సూర్య పుత్ర నమస్తేస్తు సంవర్తక నమోస్తుతే నమో మందగతే
తుభ్యం నిస్త్రీంశాయ నమోస్తుతే తపసా దగ్ధదేహాయ నిత్యం
యోగరతాయ చ నమో నిత్యం క్షుధార్తాయ అతృప్తాయ చ వై నమః
జ్ఞాన చక్షుర్నమస్తేస్తు కాశ్యపాత్మజసూనవే తుష్టో దదాసి వై రాజ్యం రుష్టో
హరసి తత్క్షణాత్ దేవాసుర మనుష్యాశ్చ సిద్ధ విధ్యాధరోరగా:
తవ్యా విలోకితా: సర్వే నాశం యాన్తి సమూలతః ప్రసాదం కురు
సౌరే వరదీ భవ భాస్కరే ఏవం స్తుతస్తదా సారిగ్రహరాజో మహాబలః
అవ్రవీచ్చ శనిర్వాక్యం హృష్టరోమా చ పార్దివః తుష్టోహం
తవ రాజేంద్ర స్తోత్రేనానేన సువ్రత ఏవం వరం ప్రదాస్యామి యన్తే మనసి వర్తతే
దశరథ ఉవాచ పసన్నో యది మే సౌరే వరం దేహి మమేప్సితమ్
అద్య ప్రభ్రుతిప్పింగాక్ష పీడా దేవా న కస్యచిత్ ప్రసాదం కురు మే సౌరే వరోయం
మే మహేప్సితః శని ఉవాచ అదేయస్తు వరౌస్మాకం తుష్టోకం చ
దదామి తే త్వచాప్రోక్తం చ మే స్తోత్రం యే పఠిష్యంతి మానవాః
దేవాసుర మనుష్యాశ్చ సిద్ద విద్యాధరోరగా న తేషా బాధతే పీడా మత్క్రుచా వై
కదావన మృత్యుస్థానే చతుర్థే వా జన్మ వ్యయ ద్వితీయగే గోచరే జన్మకాలే
వా దశాస్వన్తర్దశాసు చ యః పఠేత్ ద్వి త్రి సంధ్యం వా శుచిర్భూత్వా సమాహితః
న తస్య జాయతే పీడా కృత వై మమనిశ్చితమ్ శని శాంత మంత్ర స్తుతి